Friday, May 17, 2024
- Advertisement -

విద్యార్థుల‌కు జ‌గ‌న్ ట్విట్ట‌ర్ పిలుపు

- Advertisement -

ఏపీకి ప్ర‌త్యేక‌హోదాకోసం పోరు క్లైమాక్స్ కు చేరింది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అవిశ్వాసంపై చ‌ర్చించాల‌ని కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. అయినా కేంద్ర వైఖ‌రిలో మార్పు లేక‌పోవ‌డంతో తాజాగా జ‌గ‌న్ ట్విట్ట‌ర్‌లో స్పందించారు.

యువత ఉద్యోగాలకు ప్రత్యేక హోదా అనేది పర్యాయపదమని ఆయన ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాను ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్శిటీ ప్రాంగణాలలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, మండలం, జిల్లా స్థాయుల్లో విద్యార్థులు, వైసీపీ నేతలు కలసి రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని ట్విట్ట‌ర్‌లో పిలుపు నిచ్చారు.

పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని… ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ లో నిరవధిక నిరాహారదీక్షను చేపడతారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత భవిష్యత్తు కోసం టీడీపీ ఎంపీల చేత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయించాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -