వైసీపీ శ్రేణుల్లో ఉత్సహం ఉరకలేస్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నంద్యాల్లో ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లా నలుమూలల నుండి నంద్యాలకు చేరుకున్న శ్రేణులు జగన్కు భారీ ఘనస్వాగతం పలికారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు ఆయన నియోజవకర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. నంద్యాల రూరల్ మండలం రైతునగర్ నుంచి ప్రచారం మొదలుపెట్టారు.
ఎన్నికల ప్రచారంలోప్రజలుజగన్కుబ్రహ్మరథంపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, మంత్రులు ప్రచారానికి వస్తే ఒక్క ప్రశ్న వేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఒక వేళ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని పోటీ పెట్టకపోయి ఉంటే నంద్యాలలో ఒక్క రూపాయి అయిన ఖర్చు పెట్టేవారా అని ప్రశ్నించాల్సిందిగా జగన్ కోరారు. కేవలం ఉప ఎన్నికలు రావడం వల్లే నంద్యాలపై చంద్రబాబు ప్రేమ ఒలకబోస్తున్నారని జగన్ విమర్శించారు.
ఈ రోజు రాష్ట్రం మొత్తం నంద్యాల ప్రజలు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. ధర్మానికి- అధర్మానికి, నీతికి- అవినీతికి జరుగుతున్న ఈ పోరాటంలో నంద్యాల ప్రజలు నీతి వైపు, ధర్మం వైపు నిలబడాలని జగన్ కోరారు. 2019లో జరిగే మహాసంగ్రామానికి నంద్యాల ఫలితం నాంది కావాలని జగన్ పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామన్నారు.