చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత అంబటి రాంబాబు నిప్పులు చేరిగారు. బాబు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అ మలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని మండిపడ్డారు. ప్రజాసంక్షేమం కన్నా కుటుంబ సంక్షేమమే ముఖ్యమని నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అంబటి దుయ్యబట్టారు.
కుంభకోణాలు, అవినీతితో సంపాదించిన డబ్బుతో రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో పొత్తుపొట్టుకొని వేలాడిన చంద్రాబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్ సీపీ రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోను కలిసి పోటీ చేయదని అంబటి స్పష్టం చేశారు. తమ పార్టీ సూర్యుడి లాంటిదని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా స్వయంగా, స్వతంత్రంగానే పోటీచేస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి పొత్తుల్లేకుండా పోటీ చేసిన చరిత్ర లేదని, వారికి ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదని ఎద్దేవా చేశారు.
పాదయాత్ర సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదంటూ అంబటి విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తున్నారని, కానీ చంద్రబాబు మాత్రం రాత్రి సమయాల్లో యాత్ర చేశారని ఎద్దేవా చేశారు.