సినీ నటుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనారోగ్యంనుంచి కోలుకున్న పోసాని మీడియా ముందుకు వచ్చారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న వారిపై పోసాని ఫైర్ అయ్యారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లకు కలిపి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం రెండు నెలల పసిబిడ్డని అప్పుడే విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.
లోకేష్ కు పని లేకపోవడంతోనె సోషల్ మీడియాలో ట్వీట్ లతో గడుపుతున్నారని సెటైర్లు వేశారు. జగన్ జనానికి నచ్చేలా పాలిస్తున్నారు. లోకేశ్కు నచ్చేలా జగన్ పాలన సాగించాలంటే.. ఇసుక దొంగతనం చేయాలి, పోలవరంలో సొమ్ములు తినాలి, గాలికి పడిపోయేలా సెక్రటేరియట్ కట్టాలి, రైతుల నుంచి 30-40 వేల ఎకరాల పొలాలన్నీ లాక్కోవాలి.. అందులో మీకు 200-300 ఎకరాలు ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పనిలో పనిగా పవన్ పై కూడా ఘాటు విమర్శలు చేశారు. జగన్ను ఎన్నికల ముందు నుంచి పవన్ నిలదీస్తున్నారు. ఇప్పుడు కూడా నిలదీయమనండి. మొదటి నుంచి ఆయన జగన్ను విమర్శిస్తూనే ఉన్నారంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రతి మీటింగ్లోనూ పులివెందుల రౌడీలను తరిమేస్తా , కడపనుంచె అవినీతిని బద్దలు కొడతానని ప్రసంగాలు చేశారు. ఆయనపై రౌడీషీట్ ఉంది, ఈ మర్డర్ చేశారని స్పష్టంగా చెప్పమనండీ. పవన్ ఎన్ని రకాలుగానో విమర్శించారు. జగన్ నచ్చాల్సింది జనానికి గాని నాయకులకు కాదన్నార. ప్రజలకు వంద శాతం నచ్చాడు. అందుకే 151 సీట్లు ఇచ్చారన్నారు.