ఏపీ రాజకీయాలు ప్రస్తుతం విశాఖ చుట్టూ తిరుగుతున్నాయి. వికేంద్రీకరణలో భాగంగా విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ కు అడుగడుగున ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో వైసీపీ నేతలు భారీ ఎత్తున భూకబ్జా కు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అమరావతి రైతులు.. అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని నిరసనలు ఉదృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులను మరిపించేలా విశాఖగర్జన కార్యక్రమాన్ని ఈ నెల 15న ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు వైసీపీ నేతలు.
అయితే ఈ గర్జన విషయంలో ఊహించని విధంగా పవన్ స్ట్రోక్ తగిలింది వైసీపీకి. “దేనికి గర్జన.. ” ..పవన్ వరుస ట్వీట్ లతో ప్రశ్నలు సంధించారు. దీంతో వైసీపీ నేతలు పవన్ పై ముప్పేట విమర్శల దాడి చేయడం ఆరంభించినప్పటికి.. సమాధానాలు మాత్రం చెప్పడం లేదు వైసీపీ నేతలు. ఇదిలా ఉండగా విశాఖలో వైసీపీ గర్జనకు షాక్ ఇచ్చే విధంగా ఈ నెల 15 నుంచి విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట. ఇప్పటికీ పవన్ టూర్ కు సంబంధించి అన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు సమాచారం.
దీంతో పవన్ జనవాణి కార్యక్రమం ముందు వైసీపీ వారి ” గర్జన ” ఏ మాత్రం నిలబడలేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న బోగట్ట. అయితే అటు వైసీపీ ఇటు జనసేన విశాఖ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటనేదానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం..అమరావతి రైతుల నిరసన యాత్ర విశాఖకు చేరిన వేళ.. ఆయాత్రకు అడ్డుకట్టే వేసేందుకే వైసీపీ నేతలు 15న విశాఖ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఊహించని విధంగా జనసేనాని ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. మరి విశాఖ కేంద్రంగా జరుగుతున్నా ఈ రాజకీయం ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Also Read
మోడీకి గుజరాత్ పై ఉన్న ప్రేమ.. దేశంపై లేదా ?
కేసిఆర్ కు గుజరాత్ పైనే గురి ?
త్వరలో విజయసాయి రెడ్డి న్యూస్ చానల్.. వాళ్ళే ప్రధాన టార్గెట్ ?