చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలని అందరు విమర్శిస్తుంటారు. కాని అప్పుడప్పుడూ నిజాలు కూడా మాట్లాడుతుంటారు . పాలకొండ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశంపార్టీ కార్యక్రమాన్ని ప్రాంరభిచారు బాబు. అయితె ఎవరూ నమ్మలేని నిజాలు మాట్లాడారు. మాపార్టీలో ఉన్న నాయకులు అందరూ నిజాయితీ పరులని చెప్పుకొనే బాబు మొదటి సారిగా…మాపార్టీలో కూడా రౌడీలు, దొంగలున్నారని ఒప్పుకోవడంతోపాటు జగన్పై కూడా విమర్శలు చేశారు.
వైసీపీ తాత్కాలిక పార్టీ, అందులో ఉండేవారంతా రౌడీలు, జేబుదొంగలే’’,,,ఇది చంద్రబాబునాయుడు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నాయి. పాలకొండ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశంపార్టీ కార్యక్రమాన్ని ప్రాంరభిచారు. అయితె బాబు చేసిన వ్యాఖ్యలమీద అందరికీ ఓ సందేహం వస్తోంది. వైసీపీలో ఉండేవారంతా రౌడీలు, జేబుదొంగలే. సరే, నిప్పు చంద్రబాబు మాటలే కాసేపు నిజమే అనుకుందాం.
ఆ నిప్పు,పప్పు పక్కన పెడితె…వైసీపీలోని 21 మంది ఎంఎల్ఏలను ప్రలోబాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నదెవరు? చంద్రబాబే కదా? అంటే వాళ్ళు జేబుదొంగలు, రౌడీలని తెలిసే కదా లాక్కున్నారు. పైగా వారిలో నలుగురికి మంత్రిపదవులు కుడా కట్టబెట్టారు మన నిప్పు చంద్రబాబు.
నంద్యాల, కాకినాడలో గెలుపు తర్వా మళ్ళీ మరి కొందరికి గాలమేస్తున్నారని ప్రచారం జరుగుతోంది కదా? రౌడీలకు, జేబుదొంగలకు ఎందుకు గాలమేస్తున్నట్లు? వైసీపీలో ఉన్నపుడు దొంగలు, టిడిపిలోకి మారగానే దొరలైపోతారా? దొంగలెక్కడున్నా దొంగలే కదా? ఏదో ఆవేశంలో నోరు జారినా టిడిపిలో కుడా రౌడీలు, జేబుదొంగలున్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లే కదా.