Monday, May 6, 2024
- Advertisement -

అసెంబ్లీలో చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడిపై రోజా సెటైర్లు..

- Advertisement -

వైసీపీ మ‌హిళా ఫైర్ బ్రాండ్ రోజా తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో బాబ‌కు చుక్కులు చూపించి అచ్చెన్నాయుడిపై సెటైర్లు వేశారు. టీడీపీ హ‌యాంలో అసెంబ్లీ స‌మావేశాల‌నుంచి స‌స్పెండ్ అయిన రోజా న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెల్లారు. అక్క‌డ రోజాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అసెంబ్లీలోకి అనుమ‌తించాన‌ల‌ని సుప్రీంకోర్టు ఉత్త ర్వ‌లిచ్చినా నాటి టీడీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు.

ఇటీ వ‌లె జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి రోజా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. స్పీక‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంపై విరుచుకు ప‌డ్డారు. మొద‌టి రోజునె బాబుకు చుక్క‌లు చూపించారు. మ‌రో నేత అచ్చెన్నాయుడిపై సెటైర్లు వేశారు. తమ్మినేని సీతారాం స్పీకర్ కుర్చీని అలంకరించే సమయంలో చంద్రబాబు వేదికపైకి రాకపోవడాన్ని రోజా తీవ్రంగా తప్పుబట్టారు.

స్పీకర్‌ను అవమానించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఎన్నికైన సమయంలో కూడ చంద్రబాబు ఇలానే అవమానించాడని..,. ఇవాళ కూడ మిమ్మల్ని అవమానించారన్నారు. స్పీకర్ చైర్‌ను కూడ దుర్వినియోగం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతోందన్నారు. బీసీ సామాజిక వ‌ర్గంనుంచి స్పీక‌ర్‌గా ఎన్నికైన సీతారంను చూస్తె కొంద‌రికి కడుపు మండుతోంద‌ని అచ్చెన్నాయుడిపై ప‌రోక్షంగా సెటైర్లు వేశారు. ఇన్నాళ్ల‌కు రోజా అసెంబ్లీలో త‌న కోరిక తీర్చుకున్నార‌న్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -