రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఇటీవల ఏఐసీసీ చింతన్ శిబిర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో చింతన్ శిబిర్ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు జూన్ ఒకటి, రెండే తేదీల్లో టీపీసీసీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఉదయ్పూర్ చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలను బలపరుస్తూ తీర్మానాన్ని ఆమోదించనుంది.
మరోవైపు టీపీసీసీ చింతన్ శిబిర్కు ఏఐసీసీ నుంచి ఒక ముఖ్యనేత వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. ఇదే ఊపుతో టీపీసీసీ చింతన్ శిబిర్ సందర్భంగా మరికొందరు ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని భావిస్తున్నారు.
ఏఐసీసీ ముఖ్యనేత సమక్షంలో చేరికలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హస్తం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలతో కాంగ్రెస్ నాయకులు టచ్లో ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫోకస్