భారత మొబైల్ వినియోగదారులను చైనా ఫోన్స్ ఎ రెంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చైనా నుంచి వస్తున్న ఫోన్స్ కి ఇక్కడ మంచి డిమాండ్ ఉండటంతో.. మరికొన్ని ఫోన్స్ దిగిమతి అవుతున్నాయి. ఈ క్రమంలో చైనా ఫోన్స్ భారత్ లో బాగా అమ్ముడుపోవడంతో ఇండియన్ కంపెనీ అయిన మైక్రోమైక్స్ బాగా వెనుకబడి పోయింది. చైనా ఇస్తున్న పోటీని మైక్రోమైక్స్ అసలు తట్టుకోలేక పోయింది.
దాంతో మళ్లీ పుంజుకునేందుకు మైక్రోమ్యాక్స్ కొత్త ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ప్రస్తుతం 2g , 3g , 4g మొబైల్స్ ఉన్న జియో మార్కెట్లకి వచ్చినప్పటి నుండి 4g మొబైల్స్ వాడకం బాగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 4జీ స్మార్ట్ ఫోన్ కొనాలంటే.. కనిసం 5 వేల నుంచి 10000 ఉండాల్సిందే. అయితే మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకు 4జీ స్మార్ట్ ఫోన్ను ఇవ్వబోతోంది. కేవలం రెండు వేల రూపాయలకే 4జీ స్మార్ట్ ఫోన్ భారత్ 1 పేరుతో రిలీజ్ చేయబోతుంది. ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
మైక్రోమ్యాక్స్ భారత్ 1 ఫీచర్స్ :
* 4 ఇంచ్ డిస్ప్లే,
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్
* 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో
* 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0
* 1300 ఎంఏహెచ్ బ్యాటరీ
Related