ఇండియన్ టెలికం రంగంలో జియో ఇస్తున్న ఉచిత ఆఫర్ల దెబ్బకు మిగిలిన టెలికం కంపెనీలు కూడా రోజుకో ఆఫర్ తో మార్కెట్లో తమ యూజర్లను కాపాడుకోవడమో తో పాటూ.. కొత్త యూజర్లను ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నాయి. ఈ నెపథ్యంలోనే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు 1జీబీ ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది.
ఈ ఆఫర్ కు కొన్ని నిబంధనలు కుడా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉండి, కంపెనీ డేటా సర్వీసులు వాడుకోని వారికే అందిస్తామని కూడా చెప్పింది. డిజిటల్ ఇండియా ట్రైవ్లో భాగంగా స్మార్ట్ఫోన్ యూజర్లకు ఈ స్పెషల్ ఫ్రీ ఆఫర్స్ ఇస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. దీంతో తమ ప్రీపెయిడ్ మొబైల్ సర్వీసుల్లో ఇంటర్నెట్ యూజర్లను పెంచుకుంటామని వివరించింది. ప్యాన్ ఇండియా బేసిన్లో భాగంగా ఈ ఆఫర్ అందుబాటులోకి తెస్తున్నట్టు కూడా బీఎస్ఎన్ తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్పై ఎక్కువమంది ఇంటర్నెట్ యూజర్లను ఆర్జించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
{youtube}N0rJvwuBP5U{/youtube}
Related