అధికార మదంతో కొట్టిమిట్టాడుతున్న ఓ బీజేపీ నేత గిరిజన యువతిపై దారుణరీతిలో గ్యాంగ్రేప్కు పాల్పడ్డాడు. గతంలో ఆ యువతిని సదరు బీజేపీ నేత వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ నేత తనపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని ఆ గిరిజన యువతిపై పదే పదే ఒత్తిడి తెచ్చాడు. అయినా ఆమె లొంగకపోవడంతో ఆ బీజేపీ నేత తనతో పాటు మరో ఐదుగురితో కలిసి ఆమెపై అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డాడు.
మధ్యప్రదేశ్లోని బైతూల్ జిల్లా అమ్లా పరిధిలో నివసిస్తున్న గిరిజన యువతి ఇంటికెళ్లిన స్థానిక బీజేపీ నేత ఆమెను నిర్మానుష్యంగా ఉన్న అడవిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. అతడితో పాటు మరో ఐదుగురు కూడా ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారు. తనపై 36 గంటల పాటు సామూహికంగా మృగాల్లాగా మీద పడి అత్యాచారానికి పాల్పడ్డారని కన్నీళ్లతో చెప్పింది. తనపై ఆ మృగాళ్లు విరుచుకుపడడంతో తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని ఆమె చెప్పింది.
స్పృహలోకి వచ్చాక తాను 13 కిలోమీటర్లు నడిచి బైతూల్కు చేరుకున్నానని, ఇంటికి ఫోన్ చేసి జరిగింది చెప్పినట్లు ఆ యువతి పేర్కొంది. ఆ తర్వాత మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేసినట్లు ఆ యువతి తెలిపింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ స్పందించారు. విచారణకు ఆదేశించారు.
Related