తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మైనర్ బాలిక బిడ్డకు పదమూడేళ్ల మైనర్ బాలుడే కారణం కావడం పోలీసులను షాక్ అయ్యేలా చేసింది. పాతనాపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండగా ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బాలికను పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పి ప్రసవం చేశారు. బాలికకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. తాను గర్భం దాల్చడానికి కారణం తమ ఇంటి పొరుగున ఉన్న 13 ఏళ్ల బాలుడు కారణమని చెప్పడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి నిందితుడైన మైనర్ బాలుడిని సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
దీంతో తాను కొన్నిసార్లు బాలికతో.. సెక్స్ లో పాల్గొన్నానని మైనర్ బాలుడు అంగీకరించాడు. బాలుడు స్కూల్ లో 8వతరగతి చదువుతున్నాడని పోలీసులు చెప్పారు. పోలీసులు నిందితుడైన బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ బాలుడికి బెయిలు మంజూరు చేశారు. బిడ్డకు తండ్రి ఎవరో గుర్తించేందుకు బాలుడి తల్లిదండ్రుల అంగీకారంతో అతని రక్తనమూనాను సేకరించి డీఎన్ఏ పరీక్ష కోసం పంపించారు.
{youtube}OlfYAWIfZlM{/youtube}
Related