సాధారణంగా చాలామంది చపాతి ఆలు కర్రీ తినేకంటే రెండు కలిపి ఆలు పరోటాగా తయారు చేసుకొని తినడానికి ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ విధమైనటువంటి ఆలు పరోటా అంటే పిల్లలకి ఎంతో ఇష్టం.మరి ఎంతో రుచికరమైన ఆలూ పరోటా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు:
గోధుమపిండి 2 కప్పు,బంగాళాదుంపలు 1 కప్పు,ఉప్పు
పచ్చిమిర్చి పేస్ట్ 2టేబుల్ స్పూన్లు,కొత్తిమీర తురుము
నూనె,చిటికెడు పసుపు, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
కరివేపాకు రెమ్మ .
తయారీ విధానం:
*ముందుగా గోధుమ పిండిని శుభ్రం చేసి చపాతీ పిండి మాదిరిగా కలిపి సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా బంగాళదుంప కూడా బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
*ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
*ఉల్లిపాయలు కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే దీనిలోకి పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, వేసి బాగా మగ్గనివ్వాలి.
Also read:ఫోటో వైరల్: ఆర్ఆర్ఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసిన వార్నర్…!
*చిన్నమంటపై ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత ఈ ఉల్లిపాయల మిశ్రమంలోకి ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలను వేసి బాగా కలియబెట్టాలి.
- ఈ విధంగా వేసిన బంగాళదుంప ముక్కలను రెండు నిముషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారనివ్వాలి.
- ఇప్పుడు చపాతి పిండి తీసుకొని దానిని పూరీ సైజులో పెద్దగా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరిలోకి ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి పూరి మొత్తం ఆ మిశ్రమం కనపడకుండా కప్పివేయాలి.
Also read:ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ ఆ హీరోనే అంటున్న రష్మిక?
- తరువాత ఈ పిండిని పూరి సైజులో పెద్దగా చేసుకుని పాన్ పై కొద్దిగా నూనె వేసి అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఆలు పరాట తయారైనట్లే.