హైదరాబాద్ లో పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదుల వ్యవహారం.. ప్రజల్లో ఆందోళనలు పెంచుతోంది. ఆలయాలు, షాపింగ్ మాళ్లలో పేలుళ్లకు ఐసిస్ తీవ్రవాదులు ప్లాన్ చేశారంటూ.. వాట్స్ యాప్ లో.. ఫేస్ బుక్ లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో ఉన్న తమవారి పరిస్థితి ఎలా ఉందో అని.. వేరే ప్రాంతాల్లో ఉన్న చాలా మంది భయపడుతున్నారు. ఫోన్లు చేస్తూ.. తమవాళ్లను జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు.
ప్రజలు ఇంతలా ఆందోళన చెందుతుండడంపై.. హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఎవరూ భద్రత పరంగా ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండగ ముందుండడంతో.. సిటీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన మాట వాస్తవమని చెప్పారు. ఇదే సమయంలో.. ఐసిస్ ఉగ్రవాదుల కదలికలు బయటపడడంతో.. అదనపు బలగాలు తెప్పించి మరీ.. భద్రత ఏర్పాటు చేశామన్నారు.
ఎవరూ.. భద్రత విషయంలో ఆందోళన చెందొద్దని.. ఆవిషయం తమకు వదిలేయాలని సూచిస్తున్నారు. పండగను ఆనందంగా.. ప్రశాంతంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. పోలీసులు భరోసా ఇవ్వడంతో.. ప్రజలు కూడా కాస్త రిలీఫ్ గా ఫీలవుతున్నారు.
Trending