- Advertisement -
నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ దిల్ రాజుకు ఈ ఏడాది అలా ఇలా కలిసి రాలేదు. ఏడాది మొదట్లోనే పటాస్ తో పటపటలాడించాడు.
ఆ తర్వాత తక్కువ బడ్జెట్ తో రూపొందిన కేరింత, తక్కువ మొత్తంతో సొంతం చేసుకున్న ఓకె బంగారంతో చేతులు నిండా సంపాదించాడు. అది చాలదన్నట్లు కేవలం 25 కోట్లతో సొంతం చేసుకున్న బాహుబలితో 50కోట్లకు పైగా షేర్ లాగాడు.
ఈ వీకెండ్ మన ముందుకొచ్చిన సినిమా చూపిస్త మావను కేవలం రెండు కోట్లతో సొంతం చేసుకుని దానికి డబుల్ ,ట్రిపుల్ ప్రాఫిట్ సాధిస్తాడని చెబుతున్నారు. బహుశ దిల్ రాజు పరిశ్రమకు వచ్చాక ఇంతలా కలిపికొట్టు కావేటి రంగా కాన్సెప్ట్ గతంలో అతనికి ఎప్పుడూ వర్కవుట్ కాలేదు.