ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ , తెలంగణా ప్రాంతం లో కోదండరాం ఇద్దరూ విపక్షంగా ఒకే స్టైల్ లో పని చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ గత ఎన్నికల లో టీడీపీ కి ఫుల్ సపోర్ట్ చేసాడు పవన్ కళ్యాణ్. అలాగే కోదండరాం కూడా తెరాస మీద పోయిన ఎన్నికల్లో పాజిటివ్ గానే పార్టిసిపేట్ చేసారు.
పవన్ , కోదండరాం ఇద్దరూ ప్రశ్నించడం కోసమే వచ్చాం అని ప్రకటించారు. పవన్ ఒకపక్క రాజకీయ శక్తి గా ఎదగడానికి చూస్తున్న టైం లో కోదండరాం మాత్రం అసలు రాజకీయాల మీద ఆసక్తి చూపించడం లేదు. తెలంగాణా లో కోదండరాం నేతృత్వం లో జేయేసీ నడుస్తోంది, ప్రస్తుతం తెలంగాణా లో ఈయన కి సానుకూల పవనాలు వీస్తున్నాయి. సో తెలంగాణా లో తనకి అంత గొప్పగా లేని రాజకీయ ఒరవడి ని కోదండరాం ద్వరా పొందుదాం అని పవన్ చూస్తున్నాడు అనేది విశ్వసనీయ సమాచారం.
తెలంగాణా లో కెసిఆర్ కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా గత ఎన్నికల్లో పవన్ ని ఎవరూ పట్టించుకోలేదు. అలాంటిది ఫ్యూచర్ లో తెరాస ఇంకా బలంగా అవుతుంది తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు, సో పవన్ కోదండరాం తో కలిసి తెలంగాణా లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి కృషి చేస్తున్నారు అనే టాక్ ఉంది.