Tuesday, April 30, 2024
- Advertisement -

తండ్రికొడుకులు.. ఒంటరిగా ఉన్న కూతిరిపై రేప్..

- Advertisement -

ఓ దారుణమైన సంఘటన విశాఖపట్నంలో జరుగింది. ఓ మహిళపై తండ్రికొడుకులు.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెపై అత్యాచారం చేశారు. తన 24 ఏళ్ల వయస్సు గల కూతురిపై 45 ఏళ్ల తండ్రి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఆమె సోదరుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆ మహిళ భర్తతో విడిపోయి.. నెల్లూరులో తన పుట్టింట్లో ఉంటుంది.

అది జరిగిన తర్వాత ఆమె తండ్రి రెండు పెళ్లిలు చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. ఆ మహిళ విజయనగరంలోని.. బంధువు ఇంటో ఉంటుంది. ఆమె సోదరులు, తండ్రి విశాఖలో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూతురిని తండ్రి విశాఖపంట్నం తీసుకుని వచ్చాడు. తనను తండ్రి, సోదరుడు, కజిన్ రేప్ చేశారని ఆమె విశాఖ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో ప్రధాన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాగా.. మరో నిందితుడు బిటెక్ గ్రాడ్యుయేట్. అయితే పోలీసులు.. ముగ్గురిపై కేసు నమోదు చేశామని..దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

ఇంటికి వచ్చిన కూతురిపై తండ్రి పలు మార్లు అత్యాచారం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సోదరుడు, కజిన్ మద్యం తాగి.. ఆ మహిళపై అత్యాచారం చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ మహిళను బెదిరించడంతో ఆమె చాలా రోజులు మౌనంగా ఉండిపోయింది. త్వరలోనే నిందుతులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -