- Advertisement -
దేశవ్యాప్తంగా నేడు మందు బిళ్లలు దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే, దేశంలోని అన్ని ప్రాంతాల్లోని మెడికల్ షాపులు నేడు మూతపడనున్నాయి. ఆన్ లైన్ లో ఔషధ విక్రయాలకు నిరసనగా మెడికల్ షాపుల నిర్వాహకులు నేడు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు.
ఇప్పటికే పలు నిబంధనల పేరిట తమ విక్రయాలు బాగా తగ్గాయని ఆరోపిస్తున్న మెడికల్ షాపుల నిర్వాహకులు, తాజాగా ఆన్ లైన్ విక్రయాలతో తమ వ్యాపారాలు పెను ప్రమాదంలో చిక్కుకోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ విక్రయాలు ఆపేయాలని, మెడికల్ షాపుల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో విక్రయిస్తున్న సంస్థల మీద కఠిన చర్యలు తీసుకునే చట్టాలు రావాల్సి ఉంది అని అందుకోసమే తమ పోరాటం అని వారు అంటున్నారు. మందు బిళ్ళల కోసం ఇవాళ రోగులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి వచ్చింది .