Saturday, May 4, 2024
- Advertisement -

ఐఐటీ మద్రాస్​లో కరోనా బంద్.. మొత్తం లెక్క 66 మంది..!

- Advertisement -

ఐఐటీ మద్రాస్​లో డిసెంబర్​ 1 నుంచి ఇప్పటివరకు 66 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో క్యాంపస్​లో అకడమిక్​ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇన్​స్టిట్యూట్​లో అన్ని విభాగాలు, పరిశోధనా కేంద్రాలు, గ్రంథాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు బయటకు రావద్దని, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశారు.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంటినుంచే విధులు నిర్వహించాలని నిర్దేశించారు.ప్రస్తుతం కేవలం 10శాతం మంది విద్యార్థులు ఉన్న ఐఐటీ మద్రాస్ హాస్టళ్లలో.. ఇటీవల కొంతమందికి కొవిడ్​ లక్షణాలు బయటపడ్డాయి. అధికారులు అప్రమత్తమై… అందరికీ కరోనా పరీక్షలు చేయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -