- Advertisement -
నటసింహం ట్రెండ్ ఫాలో అవ్వడు .సెట్ చేస్తాడనే మాట ఇపుడు రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది.అందరి రూట్లో వెళ్లనని చెప్పిన బాలయ్య ఇపుడు అదే రూట్లో వెళ్లడానికి సిద్దపడుతున్నాడు.ఈవిషయంలో పవన్ ,రవితేజలు ఏం చేశారో తాను కూడా అదే చేస్తానంటున్నాడు.
విషయంలోకి వెళ్లినట్లయితే బాలయ్యబాబు ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 తీసే ఆలోచనలో ఉన్నాడు.ఇప్పటికే ఈవిషయాన్ని
ఆయన పీఆర్ వోలు కన్ఫామ్ చేశారు.సింగీతం చెప్పిన కథ నచ్చడంతో వెళ్తోన్న ట్రెండ్ ను ఫాలో అవ్వడం తప్పక బాలయ్య ఈ వెంచర్ క ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.స్వతహాగా సీక్వెల్ అనే కాన్సెప్ట్ బాలయ్యకు నచ్చదు.అయినప్పటికీ బాలకృష్ణ పవన్ గబ్బర్ సింగ్ 2తోటి అంతకు ముందే చిరు శంకర్ దాదా జిందాబాద్ తోటి సినిమా తీయడంతో తాను కూడా అదే ట్రెండ్ లోకి వెళ్లక తప్పలేదు.