టాలీవుడ్ నటి రంభ ఓ మాములు అమ్మాయి. ఏదో ఒక రకంగా సినిమా హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అమ్మాయి వంద చిత్రాల్లో నటించింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రంభ తన అందాలతో పిచ్చేక్కించింది. ఆ తర్వాత ఆ అందం ఉత్తరాదికి చేరి, అక్కడ ఎంతో మందికి బంధం వేసింది. నటిగా ఎంతోమందిని ఆకట్టుకున్న రంభ భర్తను మాత్రం కొంగున ముడివేసుకోలేకపోయింది. పెళ్ళయిన కొంతకాలానికే విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కింది.
తన వైవాహిక జీవితంపై ఆమె స్పందిస్తూ… ఇంద్రన్తో నా వివాహం సరైన సమయంలోనే జరిగింది. హీరోయిన్గా చేస్తుండగానే తనతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. అప్పట్లో ఇంద్రన్ నా సర్వస్వం అనుకున్నాను. తను లేకపోతే నేను లేను. అంతలా తనని ప్రేమించాను. పెళ్ళయిన కొత్తల్లో అత్తింటి వారు ఇబ్బంది పెట్టినా మేం మాత్రం బాగా ఉండేవాళ్ళం. రెండో పాప పుట్టిన తర్వాత అత్తింటి వేధింపులు తారాస్థాయికి చేరాయి. దాంతో మా మధ్య విభేదాలు మొదలయ్యాయి.
మా మధ్య సఖ్యత కుదిర్చేవారి కన్నా మంట పెట్టేవారే ఎక్కువయ్యారు. దాంతో మా మధ్య దూరం పెరిగిపోయింది. ఇక తనతో కలిసి ఉండలేక కెనడా వదిలి ఇద్దరు పిల్లలతో చెన్నై వచ్చేశాను.ఇక్కడికి రాగానే చాన్స్ వస్తాయని అనుకోలేదు కానీ, కొంత ఆలస్యం అయిన మళ్లీ అవకశాలు వస్తాయని అనుకున్నాను. కానీ నా అంచనా తప్పయింది. దాంతో విధిలేని పరిస్థితిలో భరణం కోసం కోర్టు మెట్లెక్కాల్సి పరిస్థితి వచ్చింది. అదీ నా పిల్లల కోసమే తప్ప నా కోసం కాదు. నా భర్తతో విడిపోవాలని తీసుకున్న నిర్ణయం పూర్తిగా నా సొంతం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఎవరి మాటలు విని నేను ఈ పని చేయలేదు. పరిస్థితులు అలా వచ్చాయని వివరించారు.
Related