Sunday, May 19, 2024
- Advertisement -

జియో సంచలనం.. మార్చి 31 ఉచిత డేటా..

- Advertisement -

ఉచిత డేటా.. తో రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జియో మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు అసస్ స్మార్ట్ పోన్లు కొనే వారికి అదనంగా డేటా ఆఫర్లను ఇచ్చేందుకు జియో ప్లాన్ చేస్తోంది. Asus ZenFone Selfie, Asus ZenFone Max, Asus ZenFone Live, Asus ZenFone Go 4.5, Asus ZenFone Go 5.0, Asus ZenFone Go 5.5 వంటి అసస్ మోడల్స్‌ కొనేవారికి.. ఈ జియో డేటా ఆఫర్లు అందనున్నాయి. యూజర్లు అసస్ మొబైల్ తీశాక జియో సిమ్ కార్డును కూడా పొందాలి. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ గా చేరాలి. తర్వాత .309లకు రీఛార్జ్ చేసుకుంటే 1 జీబీ డేటాతో పాటు 10జీబీ డేటాను అదనంగా అదీ ఉచితంగా పొందవచ్చును. అంతేకాకుండా డేటా ఆఫర్ మార్చి 31, 2018 వరకు లభిస్తుందని జియో తెలిపింది. ఇంకోవైపు.. రిలయన్స్ తమ డేటా ఆఫర్లను రివైస్ చేసే పనిలో ఉంది. డేటా ఆఫర్స్రూ. 19 నుంచి రూ. 9,999 వరకు వున్నాయని.. కొత్తగా రూ.349, రూ.399 ప్లాన్లను కూడా ప్రవేశపెట్టినట్లు జియో తెలిపింది. అలాగే ధనాధన్ ప్లాన్లను డిఫరెంట్ వ్యాలీడిటీలతో రూ.309, రూ.509లకు యూజర్లకు అందించనుంది. రూ .309, రూ.509 ప్లాన్లలో.. రూ.309 ప్రకారం అన్ లిమిటెడ్ డేటా (రోజుకు 1జీబీ డేటా), 56 రోజుల వ్యాలిటీతో ఎస్సెమ్మెస్, వాయిస్ కాలింగ్స్ పొందవచ్చు. అలాగే రూ.509 ప్లాన్ ప్రకారం రోజుకు జీబీ డేటా పొందవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -