ప్రస్తుతం ఇండియన్ టెలికం రంగంలో జియో వర్సెస్ ఎయిర్టెల్ పోరు సరికొత్తగా జరుగుతోంది. ఒకరిని మించి మరోకరు అన్నట్టుగా ఈ రెండు టెలికం కంపెనీల వార్ నడుస్తోంది. రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు ఎయిర్టెల్ మరో సరికొత్త ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే రూ. 345 ప్యాక్తో ప్రీపెయిడ్ కస్టమర్లకు అన్లిమిటెడ్ కాల్స్తో పాటు రోజుకు 1జీబీ డెటాను ఎయిర్టెల్ అందిస్తోంది.
ఇక ఇప్పుడు ఎయిర్టెల్ దృష్టి పోస్ట్ పెయిడ్ సేవలపై పడింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఎయిర్టెల్ మరో సింపుల్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే పోస్ట్పెయిడ్ కస్టమర్లకు 150 రూపాయల సరికొత్త ప్యాక్ను ఎయిర్టెల్ అందుబాటులోకి తేనుంది. కేవలం 150 రూపాయల ప్యాక్తో రోజుకు 1జీబీ డేటాను 28రోజుల వ్యాలిడిటీతో అందించడానికి ఎయిర్టెల్ ప్లాన్ చేస్తోంది.
ఈ 1జీబీ డేటాలో 500 ఎంబీ పగలు, 500 ఎంబీ రాత్రి 12 తర్వాత వాడుకునేవిధంగా ప్యాక్ను ప్రవేశపెట్టనుంది. జియోను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది డేటానే ఆశిస్తున్నారని ఎయిర్టెల్ భావిస్తోంది. అందులో భాగంగానే వాయిస్ కాల్స్తో సంబంధం లేకుండా ఈ 150 రూపాయల మంత్లీ డేటా ప్యాక్ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.
Related