భారత టెలికాం రంగంలో రోజురోజుకు పోటీ తీవ్రమవుతోంది. కస్టమర్లను తమవైపు లాక్కునేందుకు టెలికం కంపెనీలు రోజుకో ఆఫర్ను ప్రకటిస్తున్నాయి. ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో దెబ్బకు విలవిల్లాడుతోన్న మిగిలిన టెలికం కంపెనీలు మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు జియో రూట్లోనే ముందుకెళుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇండియాలోనే పెద్ద టెలికం సంస్థ అయిన ఎయిర్టెల్ భారతి మరో బంపర్ అఫర్ ప్రకటించింది. జియో ప్రైమ్ ఆఫర్కు ఛాలెంజ్ విసురుతూ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. కేవలం రూ. 345 రిచార్జ్తో రోజుకు 1 జీబీ డాటా చొప్పున 28 రోజులపాటు 28 జీబీ డాటాతో పాటు అన్ లిమిటెడ్ లోకల్ & నేషనల్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ 1జీబీ డేటాను పగలు 500 ఎంబీలు, రాత్రి టైంలో 500 ఎంబీ వాడుకునేలా చిన్న ట్విస్ట్ ఇచ్చింది.
ఈ ఆఫర్ను పొందాలంటే 4జి మొబైల్ కలిగిన యూజర్లు మార్చి 31 లోపు రూ. 345తో రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు చేయించుకున్న వారు తదుపరి 11 నెలలు ఇదే మాదిరి ఆఫర్ను పొందవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న రూ.145 ప్లాన్లోనూ మార్పులు చేసింది ఎయిర్టెల్. ఈ మొత్తంతో రీచార్జ్ చేయించుకుంటే 28 రోజులపాటు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ అన్లిమిటెడ్ కాల్స్, 2 జీబీ డాటా వస్తుంది.
{youtube}laNpEYUXn4U{/youtube}
Related