Sunday, April 28, 2024
- Advertisement -

సైనిక సంక్షేమనిధికి బీసీసీఐ భారీ విరాళం…

- Advertisement -

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ బాస‌ట‌గా నిలిచింది. సైనిక సంక్షేమనిధికి రూ.20 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించింది. ఐపీఎల్ ఆరంభోత్సవ వేడుకలను రద్దు చేసుకున్న బీసీసీఐ దానికి అయ్యే ఖ‌ర్చును పుల్వామా అమర జవాన్ల కుటుంబాలకు ఇవ్వాలని సీఓఏ నిర్ణయించిన సంగతి తెలిసిందే . చెన్నై వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ, కోహ్లి సమక్షంలో భద్రతా దళాల అధికారులకు చెక్‌ను అందించనున్నారు. గత సీజన్లో ఐపీఎల్ ఆరంభోత్సవ వేడుకలకు రూ.15 కోట్లు కేటాయించారు. దీన్ని ఈ సీజన్లో రూ.20 కోట్లకు పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -