Saturday, May 4, 2024
- Advertisement -

పుణె.. పిచ్ చూసి నా ప్లాన్ మార్చా.. అందుకే సక్సెస్ అయ్యా : భువనేశ్వర్

- Advertisement -

పుణె వన్దే మ్యాచ్ లో పిచ్ చూసి తన ప్లాన్ మార్చినట్లు భారత్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపు అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ 45 పరుగులిచ్చి.. ఆరంభంలోనే ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (11), కొలిన్ మున్రో (10) వికెట్లతో పాటు మిడిల్ ఓవర్లలో హెన్రీ నికోలస్ (42) వికెట్ పడగొట్టాడు.

దాంతో తొలిత బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ 230/9కే పరిమితమైంది. ” మ్యామ్ ఆరంభంలో కొత్త బంతితో బౌలింగ్ చేసేటప్పుడు సాధారణంగా నేను స్వింగ్ రాబట్టేందుకు ఎక్కువ ప్రయత్నిస్తుంటాను. అయితే పునే పిచ్ నుంచి నేను అనుకున్నంత మేరకు స్వింగ్‌కి సహకారం లభించలేదు. దాంతో నా ప్లాన్ మార్చి.. క్రమశిక్షణతో గుడ్ లెంగ్త్‌ ప్రదేశంలో బంతులు విసిరాను. కివీస్‌‌కి బ్యాట్స్‌మెన్ చిక్కారు.

మైదానంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే.. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఇక్కడ భారత్ మేనేజ్‌మెంట్‌కి థ్యాంక్స్ చెప్పాలేమే. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువగా ఫిటెనెస్‌పై దృష్టి సారించేలా ప్రోత్సహిస్తున్నారు. దాంతో నా ప్రధర్శన కూడా మునుపటి కంటే మెరుగైంది అని భువనేశ్వర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -