Saturday, May 4, 2024
- Advertisement -

డ్రాగన్‌ చిత్తుచేసి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సింధు…

- Advertisement -

స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు దుమ్మురేపింది. మహిళల సింగిల్స్‌లో సింధు చక్కటి ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది.వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరి సత్తాచాటింది.

ఇవాళ జరిగిన సెమీఫైనల్లో సింధు వరుస గేముల్లో చైనాకు చెందిన చెన్ యు ఫీని మట్టికరిపించింది. సింధు 21-7, 21-14తో ప్రత్యర్థిని చిత్తు చేసి టైటిల్ పోరుకు సిద్ధమైంది.కేవలం 39 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుచిత్తుచేసి వరుస గేమ్‌ల్లో గెలుపొంది తుదిపోరుకు దూసుకెళ్లింది.తొలి గేమ్‌లో ప్రత్యర్థి పూర్తిగా తేలిపోయింది. సింధు జోరు ముందుకు డ్రాగన్‌ క్రీడాకారిణి నిలువలేకపోయింది. దీంతో తెలుగమ్మాయి అలవోకగా మొదటి గేమ్‌ను కైవసం చేసుకుని పైచేయి సాధించింది. గోల్డ్‌ పతకాన్ని సింధు ఒక్క అడుగుదూరంలో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -