విండీస్ పర్యటనకు టీమిండియా జట్టును ప్రకటించే ముందుగా తనను సెలక్ట్ చేయవద్దని ధోని టీమ్ మేనేజ్ మెంట్కు తెలిపిన సంగతి తెలిసందే. ప్రపంచ కప్లో పేవల బ్యాటింగ్తో విమర్శలు ఎదుర్కొన్న ధోని రిటైర్మెంట్ తీసుకుకోవాలని విమర్శలు మాజీ క్రికెటర్లు చేశారు. అయితే రిటైర్మెంట్ ఊహాగాలపై ధోని స్పందించారు.
రెండు నెలలపాటు ఆర్మీ రెజిమెంట్లో పని చేయడానికి వెళ్తున్నానని మహీ చెప్పాడు. ధోనీ క్రికెట్కు గుడ్ బై చెబుతాడని వార్తలు వస్తున్న తరుణంలో.. మహీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. ధోని నిర్ణయం చూస్తుంటె భవిష్యత్తులో క్రికెట్లో కొనసాగె అవకాశాలు లేనట్టే.పారాచూట్ రెజిమెంట్లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్గా పని చేస్తోన్న ధోనీ అభ్యర్థనకు ఆర్మీ చీఫ్ అనుమతి ఇచ్చారు.
ధోనీ ఆర్మీకి టైం కేటాయించబోతున్నాడంటూ వచ్చిన వార్తల పట్ల ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డేవిడ్ లాడ్ ధోనిని అవమానించే విధంగా వ్యంగస్త్రాలు చేశారు. కాల్ ఆఫ్ డ్యూటీ’ అంటూ స్కై స్పోర్ట్స్ క్రికెట్ చేసిన ట్వీట్కు ఎగతాళిగా నవ్వుతున్నట్టుగా ఎమోజీలతో రీట్వీట్ చేశాడు. అయితే డేవిడ్ లాడ్ చేసిన ట్వీట్పై ధోని అభిమానులు తీవ్రంగా స్పందించారు.
లాడ్ వెకిలి నవ్వు ధోనీ ఫ్యాన్స్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 8 టెస్టులు 9 వన్డేలు ఆడిన నువ్వా ధోనీని చూసి నవ్వేది అని కామెంట్ చేస్తున్నారు.