Tuesday, April 30, 2024
- Advertisement -

సొంత గ్రౌండ్‌లో ఆఖ‌రి మ్యాచ్ ఆడ‌నున్న ధోని

- Advertisement -

మ‌హేంద్ర సింగ్ ధోని ఇండియ‌న్ క్రికెట్ దిశ ,దశ‌ను మార్చిన క్రికెట‌ర్‌. ఇండియ‌న్ టీంకు రెండు వ‌రల్డ్ క‌ప్‌ల‌ను అందించిన కెప్టెన్‌. అలాంటి క్రికెట‌ర్‌కు సొంత గ్రౌండ్‌లో చాలా పేల‌వ‌మైన రికార్డు ఉంది. ధోని సొంత రాష్ట్రం అయిన రాంచీలో అత‌ను పేరిట ఓ క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించారు. ధోని టీంలో ఉండ‌గా ఇక్క‌డ మూడు మ్యాచ్‌లు జ‌రిగాయి. కాని ధోని ఇక్క‌డ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.

మిగ‌త రెండు మ్యాచ్‌ల‌లో కూడా ధోని త‌న స్థాయికి తగ్గ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేదు. వ‌చ్చే ప్ర‌పంచ క‌ప్ త‌రువాత ధోని రిటైర్ అవుతాడు , కాబ‌ట్టి సొంత గ్రౌండ్‌లో ధోనికి ఇదే చివ‌రి మ్యాచ్ అనుకోవ‌చ్చు. మ‌రి ఈ మ్యాచ్‌లో అయిన రాణించి త‌న సొంత రాష్ట్రా అభిమానుల క‌లను నేర‌వేరుస్తాడేమో చూడాలి. ఆసీస్‌తో జ‌రుగుతున్న ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్ప‌టికే 2-0 తేడాతో లీడ్‌లో ఉంది. రాంచి వేదిక‌గా మూడో వ‌న్డే ఈ రోజు జ‌ర‌గ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -