ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్ నేపధ్యంలో టీమిండియా జట్టు ఇంగ్లండుకు చేరింది. 30 నుంచి జరిగే మహాసంగ్రామానికి సిద్దమవుతోంది. అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానుల చూపు భారత్, పాక్ మ్యాచ్పైనె పడింది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతాదా లేదా అన్న దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా భారత్, పాక్ మ్యాచ్పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందించారు.
టోర్నీకి ముందు లండన్లో ఏర్పాటు చేసిన కెప్టెన్ల సమావేశంలో టీమ్స్ గురించి మాట్లాడిన కోహ్లి.. పాక్తో మ్యాచ్ని అభిమానుల తరహాలో భావోద్వేగాలకి గురవకుండా ప్రొఫెషనల్గా ఆడతామని వెల్లడించాడు. వరల్డ్కప్ షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో మ్యాచ్ని భారత్ బహిష్కరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వినిపించాయి. అయితే ఆ అవకాశాన్ని పాక్ ఇవ్వవద్దని మ్యాచ్ ఆడి గెలవాలని కొందరు సూచిస్తున్నారు.ఒకవేళ టీమిండియా ఆ మ్యాచ్ని బహిష్కరిస్తే.. విజయం సాధించినట్లవుతుందని మాజీ క్రికెటర్లు హెచ్చరించారు. అంతేకాకుండా.. పాక్ని ప్రపంచకప్లో ఓడించి అమర జవాన్లకి ఘనమైన నివాళి అర్పించాలని కూడా సూచించారు. దీంతో.. మ్యాచ్ బహిష్కరణ డిమాండ్ తగ్గింది.
పాక్తో మ్యాచ్పై కోహ్లి మాట్లాడుతూ ‘భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ భావోద్వేగాలతో కూడుకున్నది. కానీ.. అభిమానుల తరహాలో మేము ఆ మ్యాచ్ని చూడటం లేదు. మైదానం వెలుపల ఎలా ఉన్నా.. మ్యాచ్ కోసం గ్రౌండ్లోకి అడుగుపెట్టిన తర్వాత మేము ప్రొఫెషనల్గా ఆడతాం. పాక్తో అయినా.. టీమ్కి మాకు అదొక మ్యాచ్ మాత్రమే. మనం కేవలం మ్యాచ్లో మాత్రమే పోటీపడుతున్నామని గుర్తించుకోవాలి’ అని కోహ్లీ వెల్లడించాడు