Saturday, April 20, 2024
- Advertisement -

నేను సెలెక్ట్ అయ్యాను అంటే జోక్ అనుకున్నాను: తెవాతియా

- Advertisement -

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యానని చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడని అనుకున్నానని యువ ఆల్​రౌండర్​ రాహుల్‌ తెవాతియా అన్నాడు. ఇంగ్లీష్‌ జట్టుతో టెస్టు సిరీస్‌ తర్వాత మొతేరాలో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ 19 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసిన ముంబయి ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌తో పాటు రాజస్థాన్‌ ఆల్‌రౌండర్‌ తెవాతియా తొలిసారి టీమ్ఇండియాలో చోటు కల్పించింది.

అయితే, గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ మెగా ఈవెంట్‌లో పంజాబ్‌తో తలపడిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో రాహుల్‌ (53; 31 బంతుల్లో 7×6) చెలరేగిపోయాడు. ఓటమివైపు వెళుతున్న రాజస్థాన్‌ను తన సిక్సుల వర్షంతో గెలిపించాడు. కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో ఐదు సిక్సులు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు.

ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో తన పేరు మొత్తం సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోయేలా చేసుకున్నాడు. తర్వాత పలు మ్యాచ్‌ల్లోనూ మంచి బ్యాటింగ్‌ ప్రదర్శన చేయడం వల్ల ఇప్పుడు ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు.

జినోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్.. కేటీఆర్ హామీ..!

చెట్టుపై చిరుత.. అక్కడ మళ్ళీ వీడని భయం..!

కొండవీడులో సజ్జల సతీమణి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -