- Advertisement -
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్కప్ కు నేరుగా అర్హత సాధించిన జట్లను ప్రకటించింది ఐసీసీ. డిసెంబర్ 31, 2018 నాటికి టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఈ టీమ్స్ అర్హత సాధించాయి. టోర్నీ అర్హత ప్రమాణాల ప్రకారం ఆతిథ్య ఆస్ట్రేలియాతోపాటు మరో 9 జట్లు నేరుగా టోర్నీకి క్వాలిఫై అయ్యాయి.మరో రెండు జట్లు మాత్రం గ్రూప్ స్టేజ్లో తలపడి ఈ రౌండ్కు అర్హత సాధించాల్సి ఉంటుంది.
టాప్-10 జట్లలో పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్ఘానిస్తాన్ జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్కు అర్హత సాధించగా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ రెండు జట్లు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తారు.