Tuesday, April 30, 2024
- Advertisement -

సిరీస్ గెలిచిన సూర్య సేన

- Advertisement -

ఆసీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలిఉండగానే గెలుచుకుంది టీమిండియా.కీలక నాలుగో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి కెప్టెన్‌గా సూర్య తొలి సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. భారత్ విధించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది.

కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ 36 నాటౌట్‌,హెడ్‌ 16 బంతుల్లో 31 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 3, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 174 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ 29 బంతుల్లో 2 సిక్స్‌లు, 4 ఫోర్లతో 46 పరుగులు చేయగా వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ 19 బంతుల్లో 3 సిక్స్‌లు,ఒక ఫోర్‌తో 35 పరుగులు, యశస్విజైస్వాల్‌ (37), రుతురాజ్‌ గైక్వాడ్‌ (32) పరుగులు చేశారు. అక్షర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా చివరి టీ20 బెంగళూరు వేదికగా ఆదివారం జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -