ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత్ పోరాడి ఓడింది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన టీమిండియా సేఫ్లోనే ఉంది. అయితే మూడు వన్డేల్లోను ఓపెనర్లు ఘోరంగా విఫలం అయ్యారు. అయినా మూడో వన్డేకు కూడా అదేటీమ్ తో బరిలోకి దిగింది . మూడో వన్డేలో కూడా టీమిండియాఓపెనర్లతో పాటు మిడిల్ బ్యాట్స్మేన్ అంబటి రాయుడు కూడా విఫలం అయ్యారు. దీంతో చివరి రెండు వన్డేలకు జట్టులో మార్పులు తప్పవనే సంకేతాలు కెప్టెన్ కోహ్లీ ఇచ్చాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో వరుసగా విఫలమవుతున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడిపై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి.రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో 10 బంతులాడిన ధావన్ కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరగా.. 8 బంతులాడిన అంబటి రాయుడు రెండు పరుగుల వద్ద పేలవంగా క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో మిగిలిన రెండు వన్డేల్లో వారిపై వేటు పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. నాలుగో వన్డే మొహాలి వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది.