- Advertisement -
విండీస్ టూర్ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి భారత ఆర్మీ తీపి కబురు అందించింది. ఆర్మీ బెటాలియన్లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన దరఖాస్తుకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ధోని పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. పారాషూట్ రెజిమెంట్ బెటాలియన్తో కలసి మహేంద్ర సింగ్ ధోనీ ట్రైనింగ్ పొందనున్నట్టు తెలిసింది. దీంతో పాటు జమ్మూకాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా మహేంద్ర సింగ్ ధోనీకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో రెండు నెలల పాటు పారామిలటరీ రెజిమెంట్లో విధులు నిర్వర్తించనున్నారు.