Thursday, April 25, 2024
- Advertisement -

భారత్ కి స్వర్ణం ఎలా సాధ్యం అయిందంటే..!

- Advertisement -

ఏడాదికి పైగా విరామం తర్వాత భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ మెరిసింది. ఇండియన్‌ గ్రాండ్‌ప్రి-2 టోర్నీలో ఆమె 200 మీటర్ల పరుగులో స్వర్ణం గెలుచుకుంది. ఈ రేసులో హిమ 23.31 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. మొదటి నుంచి ఈ క్రీడ పై ఆసక్తి తో ఉన్న హిమ స్వర్ణం గెలుచుకోవడం పై యావత్ భారత్ గర్విస్తుంది.

స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌ మరోసారి సత్తా చాటింది. 100 మీటర్ల పరుగులో ఆమె 11.44 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి గెలిచింది. చివరిగా ద్యుతి 2019 ఆగస్టులో పోటీపడింది. గాయం.. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం ట్రాక్‌కు దూరమైంది. ఒక రకంగా చెప్పాలంటే కరోనా సమయంలో ఎంతో మంది క్రీడా కారులు నిరుత్సాహంతో నిండిపోయిన విషయం తెలిసిందే.

పారా ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్‌ టోర్నమెంట్​లో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. పురుషుల కాంపౌండ్‌ సింగిల్స్‌ విభాగంలో భారతీయులు రాకేశ్‌ కుమార్‌, శ్యామ్‌ సుందర్‌ స్వామి ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన సెమీస్‌లో రాకేశ్‌ 143-138తో అగాన్‌ (టర్కీ)ని ఓడించగా, స్వామి 145-143తో డిఫెండింగ్‌ ఛాంపియన్​ మార్సెల్‌ (స్లోవెకియా)ని కంగుతినిపించాడు.

హత్య చేసిన కోడి.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

ప్రభాస్ కు 100 కోట్ల రెమ్యునరేషన్ ?

కేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -