మొతేరా పిచ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొందరు క్రికెట్ మాజీలు సదరు పిచ్ టెస్టు మ్యాచ్లకు పనికి రాదంటూ విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ఆ విషయంపై పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. తాజాగా మరో ఇంగ్లాండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మాత్రం సరదాగా స్పందించాడు.
నిజాయితీగా చెప్తున్నా. మేము ఉన్నది భారత్లో. ఇక్కడి పిచ్లు స్పిన్కు సహకరిస్తాయని తెలుసు. అంటే ఇక్కడ బ్యాటింగ్ చేయడం కష్టమనే కదా అర్థం” అని ఆర్చర్ అభిప్రాయపడ్డాడు.
మూడో టెస్టు సందర్భంగా తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ.. కెప్టెన్ జో రూట్ తమలో స్ఫూర్తిని నింపాడని ఆర్చర్ పేర్కొన్నాడు. “డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో అశ్విన్, అక్షర్ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఇది గమనించిన మా సారథి రెండో ఇన్నింగ్స్కు ముందు మాతో మాట్లాడాడు. నిర్భయంగా ఆడాలని సూచించాడు. మనమేమీ ఓడిపోమని మాలో ధైర్యం నింపాడు. మిగిలిన మ్యాచ్లకు కూడా ఇదే ధోరణితో ఉండాలని చెప్పాడు” అని తమ నాయకుడి గురించి చెప్పుకొచ్చాడు ఆర్చర్.
కేటీఆర్ రాజీనామా చేయడానికి సిద్ధమా..!
పిచ్చి రాతలు మానండి.. మీడియాపై సురేఖ వాణి కూతురు ఫైర్!