మహేంద్ర సింగ్ ధోని …ఇండియన్ క్రికెట్లో ఈ పేరు పెను సంచలనమే అని చెప్పాలి.ఇండియాకు రెండు ప్రపంచ కప్లు అందించిన కెప్టెన్ ధోని.ఇక్కడి వరకు బాగానే ఉంది.గత కొంత కాలంగా ధోని బ్యాటింగ్లో వేగం తగ్గిన మాట వస్తవమే.తాజాగా ధోని రిటైర్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్ల నుంచి బాల్ తీసుకుని దానిని చూసుకుంటూ.. ముభావంగా పెవిలియన్ బాట పట్టాడు. ఆ సన్నివేశం చూసిన భారత అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు.
ఎవరైనా గెలిచిన మ్యాచ్లో గుర్తుగా ఇలా తీసుకుంటారు కానీ ధోనీ ఓడిన మ్యాచ్లో బాల్ను అడిగి తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టెస్టులకు వీడ్కోలు పలికే సమయంలో కూడా వికెట్ బెల్స్ను తీసుకెళ్లాడు.. తాజాగా అంపైర్ల నుంచి బంతిని తీసుకోవడం అభిమానుల్లో పెద్ద చర్చకు కారణమైంది. అయితే ధోని 2019 ప్రపంచ కప్ వరకు క్రికెట్ ఆడతాడని ఇండియన్ క్రికెట్ బోర్డు ఆశిస్తుంది.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.