- Advertisement -

విరాట్ కోహ్లి కంటే రోహిత్ శర్మనే బెటర్…టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్….

- Advertisement -

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఓపెనర్ రోహిత్ శర్మనే బెష్టా…? అది అనింది ఎవ‌రో కాదు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డారు. అయితి ఇది కోహ్లీ అభిమానుల‌కు ఇబ్బంది అంశ‌మే. కానీ కోహ్లి అభిమానులు ఈ మాటని ఒప్పుకోకున్నా ఇది మాత్రం వాస్తవమని ఆయన పునరుద్ఘాటించారు.

ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ.. టీ20లో మెరుపు శతకం సాధించిన విషయం తెలిసిందే. అతని జోరుతో భారత్ జట్టు శ్రీలంకపై 2-1తో వన్డే సిరీస్‌ని.. 3-0తో టీ20 సిరీస్‌ని చేజిక్కించుకుంది. తాజాగా సందీప్ పాటిల్ ఓ టీవీ ఛానల్‌‌తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విరాట్ కోహ్లి అభిమానులు ఈ మాటని ఒప్పుకోకపోవచ్చు. కానీ.. కోహ్లి కంటే రోహిత్ శర్మనే మెరుగైన బ్యాట్స్‌మెన్. విరాట్ కోహ్లి కూడా గొప్ప ఆటగాడే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అతను భారత్ జట్టు అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కోహ్లి కంటే రోహిత్ శర్మ కొంచెం ముందు ఉన్నాడు’ అని పాటిల్ వివరించారు.

వన్డే, టీ20 జట్టులో మెరుగ్గా రాణిస్తున్న రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టు జట్టులోనూ సుస్థిర స్థానం సంపాదించుకుని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -