ఐపీఎల్-11లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్తీక్ వివరించాడు. గత మ్యాచ్లో ఆడిన తుది జట్టునే కొనసాగిస్తున్నామని వివరించాడు.
ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన కోల్కతా రెండు గెలిచి రెండు ఓడింది. ఇక రాజస్తాన్ మూడు మ్యాచుల్లో తొలి మ్యాచ్ ఓడి వరుస రెండు విజయాలు అందుకుంది. తాజా మ్యాచ్లో సైతం నెగ్గి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని భావిస్తోంది. అయితే హోంగ్రౌండ్లో ఆడుతున్న రాజస్తాన్కు కలిసొచ్చె అంశం. స్టార్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ భీకర ఫామ్లో ఉండటం అదనపు బలం. ఇక కోల్కతా గత మ్యాచ్లో ఢిల్లీపై నెగ్గి రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో టాస్ గెలిచిన అన్ని జట్లు ఫీల్డింగ్ తీసుకోవడం విశేషం.
రాజస్తాన్ రాయల్స్
అజింక్యా రహానే(కెప్టెన్), శ్రేయాస్ గోపాల్, రాహుల్ త్రిపాఠి, జయదేవ్ ఉనాద్కట్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బెన్ లాప్లిన్, జోస్ బట్లర్, ధావల్ కులకర్ణి, క్రిష్ణప్పన్ గౌతమ్, డి’ఆర్సీ షార్ట్
కోల్కతా
దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, శుభ్మాన్ గిల్, శివం మావి, టామ్ కుర్రాన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్.
RR XI: A Rahane, D Short, S Samson, B Stokes, J Buttler, R Tripathi, K Gowtham, S Gopal, D Kulkarni, J Unadkat, B Laughlin
— IndianPremierLeague (@IPL) April 18, 2018