భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సచిన్- ఎ బిలియన్ డ్రీమ్స్ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. అయితే ఈసినిమాకు సంబందించి పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.రిలీజైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.17 కోట్లు రాబట్టింది.
అయితే ఈ సినిమాకి సచిన్ ఎంత పారితోషికం తీసుకున్నాడా అన్న విషయం బాలీవుడ్లో చర్చనీయాంశంగామారింది.
అయితే సినిమా తన జీవితాధారంగా తెరకెక్కిస్తున్నదే కాబట్టి పారితోషికంగా సచిన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని గతంలో వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ టాక్ మరోలా ఉంది.సచిన్ ఈ సినిమా కోసం దాదాపు రూ.35 నుంచి రూ.40కోట్లు పారితోషికం తీసుకున్నట్లని సినిమా నిర్మాణ సంస్థ వర్గాలు మీడియాతో పేర్కొన్నాయివార్తలు వెలువడుతున్నాయి.
{loadmodule mod_custom,Side Ad 1}
సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రూ.27 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాల్యం నుంచి క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన నేపథ్యంలో వచ్చిన సచిన్ సినిమా జేమ్స్ ఎరిక్సన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది.
Related