Saturday, April 27, 2024
- Advertisement -

ధోనిసేన‌కు,ఇండియ‌న్ ఏయిర్ ఫోర్స్ సిబ్బందికి స‌చిన్ సినిమా ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌

- Advertisement -
Sachin Tendulkar ready to start ‘second innings’ with his biopic

ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదలకానుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల రారాజు, శతశతక వీరుడు సచిన్‌ తెందుల్కర్‌ నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాను బుధవారం భారత క్రికెట్‌ జట్టు సభ్యులంతా ఒకేసారి, ఒకే చోట కలిసి వీక్షించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రవి భగచ్కంద వెల్లడించారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈ సినిమాను అందరికన్నా ముందే భారత వైమానికదళానికి చెందిన జవాన్లు ముందే చూశారు. భారత సాయుధ బలగాలు కోసం సచిన్ వైమానికిక దళ గ్రూప్ కెప్టెన్‌గా ఎంపికైన వైమానికదళ ఆడిటోరియంలో శనివారం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సహా ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ సచిన్, సతీమణి అంజలి, బలగాల కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు సచిన్..సచిన్ అంటూ ఆడిటోరియం నినాదాలతో హోరెత్తింది. ఈ సినిమా పూర్తికాగానే సచిన్‌కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ సందర్భంగా సచిన్‌కు ఎయిర్‌చీఫ్ మార్షల్ ధనోవా జ్ఞాపికను అందజేశారు.

{loadmodule mod_custom,Side Ad 2}

అయితే 26న విడుద‌ల అవుతున్న ఈసినిమాకు ఓప్ర‌త్యేకత ఉంది.కార్గిల్ యుద్ధంలో వాయుసేన బరిలోకి దిగింది. ఇక ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టును ఓడించడం అద్భుతం అని ధనోవా కొనియాడారు. సినిమా పూర్తయిన అనంతరం సచిన్ జవాన్ల వద్దకు వెళ్లి వారి కుటుంబాలను ఆత్మీయంగా పలుకరించాడు. మ‌రో రెండు రోజుల్లో స‌చిన్ అభిమానులంతా స‌చిన్ జీవిత ఆధారంగా తెర‌కెక్కిన ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ను చూడ‌వ‌చ్చును.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -