- Advertisement -
ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది రైజర్స్.ఏకంగా 287 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 287 పరుగులు చేయగా ఆర్సీబీ 262 పరుగులు చేసింది.విరాట్ కోహ్లీ (42), డూప్లెసిస్ (62), దినేష్ కార్తీక్ (83) పరుగులు చేశారు. చివరి వరకు పోరాడిన ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్కు ట్రావిస్ హెడ్ 102, క్లాసేన్ (67), అభిషేక్ శర్మ(34), మర్క్రమ్ (32), సమద్ (37) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి.