బంగ్లాదేశ్ తన మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని కోరడంతో, ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను ప్రారంభించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రభుత్వ సలహాలు, జట్టు భద్రతపై ఆందోళనలను కారణంగా చూపుతూ, తమ అన్ని మ్యాచ్లను భారత్ బయటకు మార్చాలని అధికారికంగా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో షెడ్యూల్ మార్పులపై ఐసీసీ కసరత్తు ప్రారంభించింది. మొదటిరోజుల ప్రణాళిక ప్రకారం, బంగ్లాదేశ్ గ్రూప్ Cలో తన తొలి మూడు మ్యాచ్లను ఫిబ్రవరి 7, 9, 14 తేదీల్లో కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్లతో ఆడాల్సి ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి ముస్తఫిజుర్ రహమాన్ను అకస్మాత్తుగా విడుదల చేయడంతో బీసీసీఐ–బీసీబీ మధ్య వివాదం చెలరేగింది. “బంగ్లాదేశ్లో తాజా పరిణామాలు”ని కారణంగా చూపుతూ, బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ముస్తఫిజుర్ను విడుదల చేసింది. ఆయనను రూ.9.20 కోట్లకు తీసుకున్నారు.
బీసీబీ అభ్యర్థన నేపథ్యంలో ఐసీసీ (చైర్మన్ జై షా నేతృత్వంలో) కొత్త షెడ్యూల్ రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది.బీసీబీ భారత్ వెలుపల వేదికకు అన్ని బంగ్లాదేశ్ మ్యాచ్లను మార్చాలని ఐసీసీకి అధికారిక ప్రతిపాదన చేసింది.
భారత్, శ్రీలంకల్లో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ 2026కు సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలపై బీసీబీ డైరెక్టర్ల బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. గత 24 గంటల పరిణామాలను సమగ్రంగా సమీక్షించి, భారత్లో ఆడాల్సిన మ్యాచ్ల విషయంలో బంగ్లాదేశ్ జట్టు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు ప్రయాణించబోమని నిర్ణయించింది అని బీసీబీ వెల్లడించింది.
లిటన్ దాస్ కెప్టెన్గా 15 మంది సభ్యుల జట్టును బంగ్లాదేశ్ ప్రకటించింది. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకల్లోని 8 వేదికల్లో జరగనుంది.
బంగ్లాదేశ్ స్క్వాడ్:
లిటన్ దాస్ (కెప్టెన్), టాంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఇమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హసన్, క్వాజీ నురుల్ హసన్ సోహన్, షాక్ మహెది హసన్, రిషాద్ హసన్, నసూమ్ అహ్మద్, ముస్తఫిజుర్ రహమాన్, టాంజిమ్ హసన్ సకిబ్, తాస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దిన్, షొరిఫుల్ ఇస్లాం.
