టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి రెండు టీ20ల్లో టీమిండియా విజయం సాధించగా మూడో టీ20లో ఆసీస్ గెలుపొందింది. ఇక ఇవాళ కీలకమైన నాలుగో టీ20 జరగనుండగా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని సూర్య సేన ఉవ్విళ్లూరుతుండగా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని ఆసీస్ భావిస్తోంది. రాత్రి 7గంటలకు రాయ్పూర్ వేదికగా మ్యాచ్ జరగనుండగా ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు…దక్షిణాఫ్రికా పర్యటను వెళ్లనుంది. ఇక దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ టూర్లో వన్డే, టీ20 మ్యాచ్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు.
అయితే టెస్ట్ మ్యాచ్ లకు ఈ ఇద్దరు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, టీ20 లకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.