సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేసె పోస్ట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. తాజాగా ఇన్స్టా గ్రామ్లో వ్యాపార ప్రకటనల ద్వారా 2019 కు గాను ఆదాయాన్ని ఆర్జించే టాప్ టెన్ ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ వారాట్ కోహ్లీ ఉన్నాడు.అత్యధిక మొత్తం తీసుకుంటున్న అథ్లెట్ల లిస్ట్లో పోర్చ్గల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి 9వ స్థానంలో నిలిచాడు.
ఒక్క వ్యాపార ప్రకటనను ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ పోస్ట్ చేస్తే రూ. కోటి 35 లక్షలు వసూలు చేస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీకి 3.81 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఈ లిస్ట్లో రొనాల్డో తర్వాత నెయ్మార్, మెస్సీ, బెక్హామ్, జేమ్స్, రొనాల్డో మొరైరా, గారెత్ బేల్, ఫుట్బాల్ ఆటగాళ్లు ఉన్నారు. టాప్ టెన్లో నిలిచిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లినే కావడం మరో విశేషం. అగ్రస్థానంలో ఉన్న రొనాల్డో ఇన్స్టాగ్రామ్లో ఒక్క వ్యాపార ప్రకటనకు రూ.6 కోట్ల 72 లక్షలు వసూలు చేస్తున్నాడు.