Friday, April 26, 2024
- Advertisement -

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న మూడో టెస్టుకు లైన్‌ క్లియర్‌!

- Advertisement -

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న మూడో టెస్టు పై తర్జన భర్జనలు జరిగాయి.  ఆస్ట్రేలియా ఒక దశలో మ్యాచ్‌ను రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చింది… అయితే బీసీసీఐ జోక్యంతో వ్యవహారం సద్ధుమణిగింది. మొత్తానికి ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న మూడో టెస్టుకు లైన్‌ క్లియర్‌ అయింది.

కాగా, ఈ నెల 7వ తేదీన జరగనున్న మ్యాచ్‌కు ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.  ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టుకు ముందే టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా ఫామ్ లో ఉన్న టీమ్ ఇండియా ప్లేయర్లు ఈ ఆటకు దూరం అవుతున్నారు.

కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ జట్టుకు దూరమవ్వగా.. తాజాగా రాహుల్ కూడా దూరమవ్వడం కాస్త ఇబ్బందిని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటరాజన్!

రెండో టెస్టులో జడేజా స్టన్నింగ్‌ క్యాచ్‌!

ఐపీఎల్‌ 2021: పునరాలోచనలో బీసీసీఐ!

యువీకి బీసీసీఐ అనుమతి ఇస్తుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -