ఆస్ట్రేలియా పర్యటనలో గాయాల బారినపడిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ఉమేశ్ యాదవ్ కూడా చేరాడు. ఇప్పటికే ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కాగా, ఇప్పుడు ఉమేశ్ సైతం గాయం పాలు అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో భారత్ ఇంకా రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా, ఉమేశ్ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ సీమర్ టి.నటరాజన్ ను జట్టులోకి ఎంపిక చేశారు.
మొత్తానికి అతి తక్కవు సమయంలోనే నటరాజన్ కి ఈ ఛాన్స్ రావడం ఎంతో అదృష్టం అని అంటున్నారు. ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ అమోఘంగా రాణించాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 7 నుంచి సిడ్నీలో జరగనుంది.
జట్టు సభ్యులు :
అజింక్యా రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, కుల్దీప్ యాదవ్.
రెండో టెస్టులో జడేజా స్టన్నింగ్ క్యాచ్!
విజయశాంతి నటించిన టాఫ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు..!