- Advertisement -
ప్రపంచకప్ సమరం లీగ్ దశ ముగించుకొని సెమీఫైనల్కు చేరుకంది. భారత్ – న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సెమీపైనల్ పోరు సాగనుంది. ఇక్కడ గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో రేపు జరగనున్న తొలి సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. గురువారం ఎడ్జ్ బాస్టన్ లో జరగనున్న రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఢీకొంటుంది. ఈ నేపథ్యంలో, ఫైనల్స్ కు ఏయే జట్లు చేరబోతున్నాయో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ జోస్యం చెప్పాడు.సెకండ్ సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుందని పీటర్సన్ చెప్పాడు. ఆదివారం లండన్ లో జరిగే ఫైనల్స్ లో ఇండియా, ఇంగ్లండ్ లు తలపడతాయని జోస్యం చెప్పాడు.