- Advertisement -
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ డ్రాగా ముగియగా వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో ఇవాళ్టి నుండి ప్రారంభం అయ్యే టెస్టు సిరీస్ను దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది దక్షిణాఫ్రికా.
వన్డే ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్,విరాట్ ఈ టెస్టు సిరీస్కు అందుబాటులోకి వచ్చారు. ఇక స్టార్ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తుండడంతో టీమిండియాకు మరింత బలం చేకూరగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్ లకు చేరువలో ఉన్నారు.
రోహిత్ శర్మ 323 పరుగులు చేస్తే టెస్టుల్లో 4 వేల క్లబ్లో చేరనుండగా ఇక విరాట్ సౌతాఫ్రికా గడ్డపై 1000 పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచేందుకు 281 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో వీరిద్దరూ ఈ ఫీట్ సాధిస్తారో లేదో వేచిచూడాలి.